కావలిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు
భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తిన పురవీధులు..
BSBNEWS - KAVALI
కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాత్రి జరిగిన భారత సైనికులకు మద్దతుగా చేసిన తిరంగా యాత్ర మువెన్నెల జెండాలతో, వందేమాతరం నినాదాలతో, భారత మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తాయి. కావలిని ప్రేమించాలి భారతదేశాన్ని ప్రేమించాలి అనే నినాదంతో ముందు నుండి ఒక కొత్త వరవడిని తీసుకువచ్చిన ప్రియతమ శాసనసభ్యులు ఆధ్వర్యంలో జరిగింది. భారీ ఎత్తున పుర ప్రజలు, పార్టీ నాయకులు, కూటమి నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు సుమారు గంట కు పైగా తిరంగా యాత్ర జరిగింది. తదుపరి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ దగ్గర జాతీయజెండాలతో రెపరెపలాడించారు. కావ్యన్న ఏది చేసినా ఆయన రూటే సపరేటు భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటాడు అని అందరూ చెప్పుకోవడం గమనార్హం. చివరగా జాతీయ గీతంతో కార్యక్రమం ముగించారు.

