జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ ఎస్ డి సి) ఆధ్వర్యంలో ఈనెల 28 సోమవారం ఉదయం పట్టణంలోని టి.ఆర్.ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు అందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. జాబ్ మేళా కు హాజరు కావాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులు ముందుగా వెబ్ సైట్ లింక్ https:// naipunyam.ap.gov.in/user - registration ద్వారా వివరములను నమోదు చేయించుకొని జాబ్ మేళా కు హాజరు కావాలని తెలియజేశారు.
మరిన్ని వివరాలకు వివరములకు
ఇమ్రాస్ 9848050543,
బాలశ్రీ 6301543185
శ్రావణి 7286822789 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఆయన తెలిపారు.