ఇంటర్ నేషనల్ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
BSBNEWS - KAVALI
కావలి పట్టణం వెంగలరావు నగర్ లోని గూగుల్ కిడ్స్ ఇంటర్ నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) ఆదివారం ప్రారంభించారు. స్కూల్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యను వ్యాపారంలా చూడకుండా, విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు. గురువుల బాధ్యత, విద్య యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు, కండ్లగుంట మధుబాబు నాయుడు, ఆలా శ్రీను, వెంకటేశ్వర్లు నాయుడు, జవంగుల మల్లికార్జున, జనసేన నాయకులు సిద్దు, వెంకట సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

