👉 మీ రాజకీయాలకోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం అడొద్దు...!
👉 వాలంటీర్ లకు న్యాయం చేయాలి..!
👉 రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లు కు న్యాయం చేయండి...!
ఆంధ్రప్రదేశ్ వాలంటిర్స్ అసోషియేషన్
BSBNEWS - విజయవాడ
రాజకీయ పార్టీల స్వార్థాల కోసం మా జీవితాలతో చెలగాటం ఆడవద్దని, వాలంటీర్లకు న్యాయం చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జగదీష్, రమణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు ప్రభుత్వాన్ని కోరారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ (ఏఐవైఎఫ్ అనుబంధం ) సమావేశం విజయవాడలోని స్థానిక దాసరి నాగభూషణరావు భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు రాజకీయాల కోసం రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాల కోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని, వాలంటీర్లకి 10000 జీతం ఇస్తామని అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఇన్ప్లిమెంట్స్ చేయాలని,రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచిన రెండు మూడు నెలల నుంచి జీతభత్యాలు నిలిచిపోయిన బకాయిలు తక్షణమే విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకి వారి జీతాన్ని ఇప్పించాలని,ఎలక్షన్ల సమయంలో లక్ష పైచిలుకు వాలంటరీలో రాజీనామాలు చేశారు అట్టి రాజీనామాల్ని బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారిని విధుల్లోకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇప్పించాలని కోరారు.మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకు కోవడం జరుగుతుందని తెలిపారు. పదవ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయలుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, పురపాలక పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు వాలంటీర్ ఆవేదన తెలియజేస్తూ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించాలని కోరుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రాధేయపడుతూ మెయిల్స్ ద్వారా పోస్ట్ కార్డుల ద్వారా లేఖలు పంపడం జరుగుతుందని, వాలంటీర్ల మీద రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నిరుద్యోగుల ఆవేదన తెలియజేస్తూ వారి సేవలను గుర్తించాలని కరోనా సమయంలో వారు చేసిన త్యాగాలను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,ఆగస్టు 14 వ తారీకు లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రానిపక్షంలో ఆగస్టు 16 తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వాలంటీర్ల గోడును విన్నవించుకుంటూ వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
👉 ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ (ఏఐవైఎఫ్ అనుబంధం) గౌరవాధ్యక్షులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, అధ్యక్షులుగా జగదీష్, ప్రధాన కార్యదర్శిగా రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా AIYF రాష్ట్ర నాయకులు లంకా గోవిందరాజులు ఉపాధ్యక్షులుగా సరోజిని, వాసు, రాజేష్ కార్యదర్శులుగా జంగాల చైతన్య, రసూల్, శ్యామలి, యామిని లతోపాటు 21 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది.