కందుకూరు లో డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి వేడుకలు
BSBNEWS - KANDUKUR
డా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పట్టణం లో తహసిల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు మాజీ శాసనసభ్యులు కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నారని ఆయన ఆశలను ముందుకు తీసుకుపోవటం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

