దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ కి ఘనంగా నివాళులర్పించిన జగన్.
BSBNEWS 02.09.2024
దివంగత నేత, సంక్షేమ ప్రదాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైయస్సార్ తనయుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి వైయస్సార్ సమాధి వద్ద ప్రార్థన నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర, జిల్లా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొని వైయస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

