బాధితులను తుఫాను పునరావాస కేంద్రానికి తరలించిన ఎస్ఐ అంకమ్మ
BSBNEWS - ULAVAPADU
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉలవపాడు లోని లోతట్టు ప్రాంతమైన తిరుపతి కుంట కాలనీ పూర్తిగా జలమయమైనాయి. అక్కడ నివాసముంటున్న యాభై కుటుంబాలు సుమారు 150 మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో విషయాన్ని తెలుసుకున్న ఉలవపాడు ఎస్సై అంకమ్మ ఆ కాలనీవాసులను పోలీసు వాహనంలో మన్నేటికోట తుఫాను పునరావాస కేంద్రానికి చేర్చారు. ఈ సందర్భంగా వారు ఉలవపాడు ఎస్సై అంకమ్మకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

