అంకమ్మ తల్లి అమ్మవారికి వెండి జడ
BSBNEWS - కందుకూరు
కందుకూరు పట్టణ గ్రామదేవత ఆదిపరాశక్తి అంకమ్మ తల్లి అమ్మవారికి కావలి వాస్తవ్యులు చలంచాల్య సూర్య ప్రకాశరావు, సీతాదేవి రూ.1,70,000 విలువైన బంగారు తాపద వెండి జడను ఆలయ ఈవో కార్తీక్ కు సమర్పించారు. దాంతో పాటు అమ్మవారి అర్చన కోసం 110 వెండి పుష్పాలను కూడా సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఈఓ రాంకుమార్, ఆలయ పునర్నిర్మాణ కమిటి సభ్యులు మంచిరాజు మురళి, ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, గాండ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


