నూతన సబ్ స్టేషన్ శంకుస్థాపనలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
త్వరితగతిన సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
- మంత్రి రవికుమార్
BSBNEWS - ఉలవపాడు
మండలంలోని మన్నేటికోట పంచాయతీలో సోమవారం నాడు 33/11 కె.వి. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ త్వరితంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు తొలగించేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవను ఆయన ప్రశంసించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సబ్ స్టేషన్ పూర్తయితే చుట్టుపక్కల గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని ఇది రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. ఇది కేవలం రైతులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో 4 సబ్ స్టేషన్ కు అనుమతులు లభించాయని వాటిలో మొదటి విడతగా ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మిగిలిన 3 సబ్ స్టేషన్ లో కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మన్నేటికోట ప్రాంతంలో ఎక్కువగా రైతులు మామిడి, సపోటా తోటల పైనే ఆధారపడి జీవిస్తున్నారని వారికి గతంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారని ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సబ్ స్టేషన్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపర్నెంట్ ఒంగోలు కట్టా వెంకటేశ్వర్లు, కందుకూరు నియోజకవర్గం డివిజన్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఉలవపాడు మండల టిడిపి అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, గ్రామ సర్పంచ్ పులివర్తి బసవయ్య నాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, వలేటి వారి పాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, లింగ సముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు స్థానిక నాయకులు నాళం గోవిందమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు చిమ్మిరి వెంకటేశ్వర్లు వీరగంధం సత్యనారాయణ చిమ్మిరి మోహన్రావు, గోత్తుల పున్నయ్య, వెంకటేశ్వర్లు, మందాడి రామారావు, బెల్లం కృష్ణమోహన్, అమరనేని రాములు, వెంకటసుబ్బయ్య, మద్దసాని మహేంద్ర , సుదర్శి శ్రీనివాసులు అంచుపోగు వాసు తొట్టెంపూడి మాల్యాద్రి, బొడ్డు ప్రసాద్ సన్నిబోయిన ప్రభావతి, దార్ల యలమందమ్మ, అమ్మనబోలు రమేష్, నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీనివాసరావు, వడ్డెళ్ళ రవిచంద్ర, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, అల్లం వెంకటేశ్వర్లు, పొడపాటి మహేష్, ఉలవపాడు మండలం అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)

.jpeg)