సమయపాలన పాటించని ఐసిడిఎస్
సిడిపిఓ ఇంచార్జ్ కావడమే అందుకు కారణమా...?
BSBNEWS - KANDUKUR
ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించని పరిస్థితి నెలకొంటుంది. ఒకపక్క కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు ప్రజలకు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని పదేపదే చెబుతున్న కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సైతం సమయపాలన పాటించకుండా ఎవరికి నచ్చినట్లు వారు విధులకు వస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఐసిడిఎస్ కందుకూరు సిడిపిఓ ఇన్చార్జిగా ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత చూస్తున్నారు. అయితే కార్యాలయానికి సిడిపిఓ ఇన్చార్జి కావడంతో అధికారులు సిబ్బంది సమయపాలన పాటించట్లేదని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.