వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్
BSBNEWS - ఒంగోలు/పెద్దదోర్నాల
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి దోర్నాల మండలం, కొత్తూరు సమీపంలోని టన్నెల్స్ ను సందర్శించి ప్రాజెక్ట్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పరిశీలించారు. ఇప్పటివరకు వెలిగొండ ప్రాజెక్టు కు సంబంధించి టన్నెల్స్ పనుల కొనసాగిన తీరు, పెండింగ్ పనులపై అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, యర్రగొండపాలెం నియోజక వర్గ టీడీపీ ఇంచార్జీ ఏరీక్షన్ బాబు, ప్రాజెక్ట్స్ ఎస్ఈ అబూతలీం తదితరులు పాల్గొన్నారు.