రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి స్వామి
BSBNEWSవిశాఖపట్నం
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్ లో విశాఖ జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి పుష్పగుచ్ఛాలు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. వాటితోపాటు పలు అంశాలను గురించి చర్చించారు.

